టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-02-23T05:56:54+05:30 IST

మండలంలోని నార్తురాజుపాళెం పంచాయతీ పరిధిలోని టపాతోపు గ్రామంలో పాతకక్షలు దృష్టిలో ఉంచుకుని టీడీపీ

టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి

కొడవలూరు, ఫిబ్రవరి 22: మండలంలోని నార్తురాజుపాళెం పంచాయతీ పరిధిలోని టపాతోపు గ్రామంలో పాతకక్షలు దృష్టిలో ఉంచుకుని టీడీపీ కార్యకర్తపై కత్తితో దాడి చేసినట్లు    పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు అందింది. టపాతోపు గ్రామానికి చెందిన పూల్ల సుజిత్‌ కుమార్‌పై పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన ప్రసాద్‌, పాకం శ్రీనివాసులు కత్తి విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో సుజిత్‌కు చేయి, వీపుపై తీవ్రగా యాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సుజిత్‌కుమార్‌ను నెల్లూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-23T05:56:54+05:30 IST