టీడీపీ అభ్యర్థినిపై దాడి
ABN , First Publish Date - 2021-11-04T01:01:06+05:30 IST
గుంటూరు జిల్లా గురజాల నగరపంచాయతీ ఎన్నికల్లో బుధవారం టీడీపీ అభ్యర్థిని సందరగిరి నజీమూన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి
గురజాల: గుంటూరు జిల్లా గురజాల నగరపంచాయతీ ఎన్నికల్లో బుధవారం టీడీపీ అభ్యర్థిని సందరగిరి నజీమూన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, నామినేషన్ పత్రాలు చించేశారు. నజీమూన్ 9వ వార్డు కౌన్సిలర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని నగర పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలోకి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న పత్రాలు లాక్కొని చించేశారు. ఈ దాడి పోలీసు అధికారుల సమక్షంలోనే జరిగిందని, అయినా వారు స్పందించలేదని నజీమూన్ వాపోయారు. మహిళా అభ్యర్థిపై దాడి జరిగినా కాపాడలేని పోలీసులు రేపు జరిగే ఎన్నికల్లో ఎలా రక్షణ కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను కలెక్టరు దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. దాడిపై టీడీపీ నాయకులతో కలిసి ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.