పేకాట శిబిరంపై దాడి
ABN , First Publish Date - 2020-02-23T06:49:00+05:30 IST
కొత్తూరు వీధి ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో కోళ్ల ఫారంపై శుక్రవారం రాత్రి ఎస్ఐ సుమంత్ దాడులు నిర్వహించారు.
ఐదుగురి అరెస్ట్..
రూ 1.34 లక్షలు స్వాధీనం
సామర్లకోట, ఫిబ్రవరి 22: కొత్తూరు వీధి ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో కోళ్ల ఫారంపై శుక్రవారం రాత్రి ఎస్ఐ సుమంత్ దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఉమాశంకర్, ఈశ్వరరెడ్డి, భాస్కరకుమార్, రవికుమార్, ఎం.శ్రీనివాస్ను పోలీస్స్టేషన్కు తరలించారు.