మహిళా పోలీసుపై దౌర్జన్యం, దాడి
ABN , First Publish Date - 2020-08-14T17:54:51+05:30 IST
చిత్తూరు: మహిళా పోలీసుపై కొందరు దౌర్జన్యం, దాడికి పాల్పడ్డారు. పెనుమూరు మండలం కలికిరి గ్రామ సచివాలయంలో..
చిత్తూరు: మహిళా పోలీసుపై కొందరు దౌర్జన్యం, దాడికి పాల్పడ్డారు. పెనుమూరు మండలం కలికిరి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు పి. ప్రియదర్శినిపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించినట్లు పెనుమూరు పోలీసు స్టేషన్లో 10 మందిపై కేసు నమోదైంది. నంజరపల్లె ఏఏడబ్ల్యూకు చెందిన ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ గ్రామంలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లను నంజరపల్లి ఏఏడబ్ల్యూకు చెందిన కొందరు చింపివేశారని సమాచారం అందడంతో మహిళా పోలీసు, సిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియదర్శిని ఆ గ్రామానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారని కేసు నమోదైంది.