ఏబీవీపీ నాయకులపై దాడి అవివేకం

ABN , First Publish Date - 2021-04-20T06:15:30+05:30 IST

ఇల్లంతకుంట మం డల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భం గా సమస్యలపై వినతిపత్రం అందించేందుకు వెళ్లిన ఏబీవీపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడం వారి అవివేకానికి నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. సోమ వారం ఇల్లంతకుంట పోలీస్‌ స్టేషన్‌లో ఏబీవీపీ నాయకులను పరామర్శించేందుకు బయల్దేరిన ఆయ నను తంగళ్లపల్లి మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు.

ఏబీవీపీ నాయకులపై దాడి అవివేకం
తంగళ్లపల్లిలో మాట్లాడుతున్న ప్రతాప రామకృష్ణ

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

- తంగళ్లపల్లిలో  అడ్డుకున్న పోలీసులు 

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 19: ఇల్లంతకుంట మం డల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భం గా సమస్యలపై వినతిపత్రం అందించేందుకు వెళ్లిన ఏబీవీపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడం వారి అవివేకానికి నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. సోమ వారం ఇల్లంతకుంట పోలీస్‌ స్టేషన్‌లో ఏబీవీపీ నాయకులను పరామర్శించేందుకు బయల్దేరిన ఆయ నను తంగళ్లపల్లి మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడు తూ రాష్ట్రంలో ప్రజాసమస్యలు చెప్పుకునేందుకు అవకాశం లేదని, సమస్యలను వివరించేందుకు మంత్రి దగ్గరికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడులు సిగ్గుచేటని అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, చట్టప రంగా శిక్షించాలని  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడ తామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కుమ్మరిశంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, కోల అంజి, కోల హారీష్‌, రాము, వెంకటి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-20T06:15:30+05:30 IST