యువకుడిపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల రాళ్ల దాడి

ABN , First Publish Date - 2021-01-12T16:13:45+05:30 IST

గుడివాడ పట్టణం, పెద ఎరుకపాడులో రెండు కుటుంబాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది.

యువకుడిపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల రాళ్ల దాడి

కృష్ణా : జిల్లాలోని గుడివాడ పట్టణం, పెద ఎరుకపాడులో రెండు కుటుంబాల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే యువకుడిపై కానిస్టేబుల్ రమాదేవి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు న్యాయం చేయాలని.. బాధితుడు పోలీసులను వేడుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2021-01-12T16:13:45+05:30 IST