సారా స్థావరాలపై దాడులు
ABN , First Publish Date - 2021-06-24T05:43:02+05:30 IST
ఓర్వకల్లులోని శికారిపేటలో నాటుసారా స్థావరాలపై బుధవారం ఎస్ఐ మల్లికార్జున, సిబ్బంది దాడులు నిర్వహించారు.
ఓర్వకల్లు, జూన్ 23: ఓర్వకల్లులోని శికారిపేటలో నాటుసారా స్థావరాలపై బుధవారం ఎస్ఐ మల్లికార్జున, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో చిన్నషాప్రోజి, పెద్ద రాముడులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 52 లీటర్ల నాటుసారాను స్వాధీనం చే సుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు వీరారెడ్డి, పవన్, రాఘ వేంద్ర, సునీల్, బలరామ్ పాల్గొన్నారు.