విత్తనాలు, ఎరువుల దుకాణాలపై దాడులు

ABN , First Publish Date - 2021-06-20T04:54:16+05:30 IST

పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహాకర మందులు విక్రయించే షాపులపై శనివారం వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించారు.

విత్తనాలు, ఎరువుల దుకాణాలపై దాడులు
రికార్డులను పరిశీలిస్తున్న ఏఓ శివశంకర్‌రెడ్డి

ప్రొద్దుటూరు రూరల్‌, జూన్‌ 19:  పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహాకర మందులు విక్రయించే షాపులపై శనివారం వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించారు. మైదుకూరు రోడ్డులోని వ రసిద్ధి వినాయక, వెంకటసాయి, మహాలక్ష్మి ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమూర్తి, మండల వ్యవసాయాధికారి శివశంకర్‌రెడ్డిలు రికార్డులను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌, ఇతర రికార్డులను పరిశీలించి గోడౌన్‌లో ఉన్న స్టాక్‌ వివరాలను నమోదు చేసుకున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.  తనిఖీల్లో వ్యవసాయాధికారులు, ఏఎ్‌సఐ శ్రీనివాసులరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:54:16+05:30 IST