‘ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు

ABN , First Publish Date - 2020-09-19T10:48:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కల మట సాగర్‌ అన్నారు. దేవాలయాలపై

‘ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు

హిరమండలం, సెప్టెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కల మట సాగర్‌ అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్ర వారం హిరమండలంలోని నీలమణి దుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు లాడె కృష్ణ, చింతాడ గిరి,యాళ్ల నాగేశ్వరరావు, శ్రీను, శ్రీధర్‌, టి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T10:48:19+05:30 IST