జోగి రమేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
ABN , First Publish Date - 2021-09-19T05:32:50+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన అనుచరులపై రౌడీ షీట్లు తెరవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
అనపర్తి, సెప్టెంబరు 18: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన అనుచరులపై రౌడీ షీట్లు తెరవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును హతమార్చాలనే ఆయన ఇంటికి ఎమ్మెల్యే జోగి రమేష్ ఆయన అనుచరులు 15 కార్లలో చంద్రబాబు నివాసాన్ని ముట్టడించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం దారుణ మన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కొవ్వూరి శ్రీనివారెడ్డి, మామిడిశెట్టి శ్రీను. తమలంపూడి సుధాకరరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, నూతిక బాబూరావు పాల్గొన్నారు.