కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నం

ABN , First Publish Date - 2021-04-20T05:41:42+05:30 IST

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నం

 చికిత్స పొందుతూ మహిళ మృతి


కంది, ఏప్రిల్‌ 19: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. గ్రామస్థులు, పోలీసుల సమాచారం మేరకు మెదక్‌ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన కవితకు కలివేముల గ్రామస్థుడై లాగుల వెంకటేశంగౌడ్‌తో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పొలం పనులు చేయడానికి రావలంటూ భర్త ఒత్తిడి చేయడంతో శనివారం మధ్యాహ్నం కవిత పురుగుల మందు తాగింది. స్థానికుల సహయంతో భర్త ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కవిత సోమవారం మృతి చెందింది. అత్తింటి వారి వేధింపులతోనే కవిత చనిపోయిందంటూ ఆమె కుటుంబసభ్యులు ఇంద్రకరణ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-04-20T05:41:42+05:30 IST