తలనీలాల సేకరణకు నేడు వేలం
ABN , First Publish Date - 2021-01-18T05:17:32+05:30 IST
మృత్యుంజయేశ్వరాలయంలో బహిరంగ వేలం ఉంటుందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కడప (సిటి), జనవరి 17 : కడప నగర శివార్లలో వెలసిన పాలకొండరాయ దేవస్థానంలో తలనీలాల సేకరణ, టెంకాయల విక్రయాలకు సంబంధించి ఈనెల 18న కడప నగరంలోని మృత్యుంజయేశ్వరాలయంలో బహిరంగ వేలం ఉంటుందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం ఉదయం 11గంటలకు ప్రారం భమవుతుందన్నారు. లీజు కాలం ఫిబ్రవరి 1 నుంచి వచ్చే సం వత్సరం జనవరి 31 వరకు ఉంటుందని, తలనీలాలకు రూ.50 వేలు, టెంకాయలకు రూ.5వేలు డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.