ఆడి ఇ-ట్రోన్ జీటీ కార్ల బుకింగ్స్ ప్రారంభం.. టోకెన్ ధర..

ABN , First Publish Date - 2021-09-09T03:53:24+05:30 IST

ఆడి ఇ-ట్రోన్ జీటీ కార్ల బుకింగ్స్ ప్రారంభం.. టోకెన్ ధర..

ఆడి ఇ-ట్రోన్ జీటీ కార్ల బుకింగ్స్ ప్రారంభం.. టోకెన్ ధర..

న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త మోడల్‌లో కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆడి ఇండియా తెలిపింది. భారత మార్కెట్‌లో ఆడి ఇ-ట్రోన్ జీటీ కార్ల బుకింగ్స్ ఇప్పుడు ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ఆడి ఇ-ట్రోన్ జీటీ కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైందని, ఇది పూర్తిగా నిర్మిత యూనిట్ (సీబీయూ)గా భారతదేశానికి వస్తుందని తెలిపింది. ఆడి ఇ-ట్రోన్ జీటీ కార్లను పండుగ సీజన్‌కు దగ్గరగా భారతదేశంలో విక్రయించబడవచ్చని సంస్థ తెలిపింది. ఆడి ఇ-ట్రోన్ జీటీ క్వాట్రో మరియు ఆడి ఆర్ఎస్ రెండూ కార్లు భారతదేశంలో విడుదల అవుతాయని భావిస్తున్నారు. ఆడి ఇండియా ప్రీ-బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించిందని, కార్ల ప్రీ-బుకింగ్స్ టోకెన్ రూ. 10 లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-09-09T03:53:24+05:30 IST