Audio Viral: ప్రీతి హత్య కేసులో నిందితుల ఆడియో వైరల్
ABN , First Publish Date - 2021-07-21T03:34:41+05:30 IST
జిల్లాలో సంచలనం సృష్టించిన చింతమల్ల ప్రీతి (17) చివరి ఫోన్ సంభాషణ
నల్గొండ: జిల్లాలో సంచలనం సృష్టించిన చింతమల్ల ప్రీతి (17) చివరి ఫోన్ సంభాషణ ఏబీఎన్ చేతికి చిక్కింది. నిందితులు పవన్, రాజుల సంభాషణల ఆడియో వైరల్గా మారింది. ప్రీతిని హత్య చేసి తాను జైలుకు పోతున్నానని రాజుకు ఫోన్ చేసి పవన్ చెప్పాడు. కేతేపల్లి మండలం కొప్పోలులో ఈ నెల 13న ప్రీతి(17) హత్యాచారానికి గురైంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎస్ఐ రామకృష్ణను వీఆర్కు అటాచ్ చేశారు. ఈనెల 17న పోలీసుల సమక్షంలో ప్రీతి మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులు రీపోస్ట్మార్టం చేసారు. ప్రీతిది హత్యాచారంగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.