Azharuddin: ఆగస్టులో ఇంగ్లండ్లో కుమ్మేయొచ్చు!
ABN , First Publish Date - 2021-08-01T02:18:16+05:30 IST
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో
హైదరాబాద్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 4వ తేదీ నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆగస్టు నెలలో ఇంగ్లండ్లో పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయని అన్నాడు. పలువురు క్రికెట్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
ఆగస్టులో ఇంగ్లండ్లో పిచ్లు పొడిగా ఉంటాయని, కాబట్టి పరుగులు అద్భుతంగా పిండుకోవచ్చని అజారుద్దీన్ ట్వీట్ చేశాడు. ఆషామాషీగా ఈ విషయాన్ని చెప్పడం లేదని, అనుభవంతో చెబుతున్నానని పేర్కొన్నాడు. వికెట్ పొడిగా ఉంటుందని, అక్కడి పరిస్థితును బ్యాట్స్మన్ సద్వినియోగం చేసుకోగలిగితే పరుగుల వరద పారించవచ్చని అన్నాడు.
అజార్ కూడా ఇంగ్లండ్లో జరిగిన రెండు టెస్టుల్లో 89.33 సగటుతో పరుగులు సాధించాడు. 2018లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య జట్టు 4-1తో భారత్ను మట్టికరిపించింది. అయినప్పటికీ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్లో కోహ్లీ మొత్తం 593 పరుగులు చేశాడు.