కోహ్లీ గుర్తుండిపోతాడు: పైన్‌

ABN , First Publish Date - 2021-05-17T10:02:14+05:30 IST

సమకాలీన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తుంటాడని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కొనియాడాడు.

కోహ్లీ గుర్తుండిపోతాడు: పైన్‌

మెల్‌బోర్న్‌: సమకాలీన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తుంటాడని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కొనియాడాడు. ‘విరాట్‌ లాంటి ఆటగాడు ప్రతీ జట్టులో ఉండాలని కోరుకుంటారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పాను. అతడో పోరాట యోధుడు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మన్‌. అతడి ఆటతో మనకు సవాల్‌ విసురుతుంటాడు. తనెప్పుడు నాకు గుర్తుండిపోతాడు’ అని పైన్‌ తెలిపాడు. అయితే గతేడాది భారత్‌ ఆసీస్‌లో పర్యటించినప్పుడు.. కోహ్లీ కూడా జట్టులో ఓ సాధారణ ఆటగాడేనని, అతడివల్ల తమకెలాంటి ఇబ్బంది లేదని సెలవిచ్చాడు.

Updated Date - 2021-05-17T10:02:14+05:30 IST