ఆసీస్ టూర్పై వచ్చేవారం స్పష్టత!
ABN , First Publish Date - 2020-10-20T08:54:56+05:30 IST
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు ఇంకా మూడు వారాల సమయమే ఉంది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు ఇంకా మూడు వారాల సమయమే ఉంది. అయితే ఐపీఎల్ హడావుడిలో ఉన్న బీసీసీఐ.. ఇంకా జట్టును ప్రకటించలేదు. ఐపీఎల్లో పలువురు ఆటగాళ్లు గాయపడుతుండడంతో వారి స్థానాలను భర్తీ చేసే వారి కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై చర్చించేందుకు వారంరోజుల్లో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షెడ్యూల్పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), బీసీసీఐతో సమాచారం పంచుకుంది. కానీ క్వీన్స్లాండ్ ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుండడంతో సీఏ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించలేదు. ఒక్కో రాష్ట్రంలో క్వారంటైన్ నిబంధనలు ఒక్కోలా ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20ల కోసం భారత జట్టు ఆసీ్సలో రెండున్నర నెలలపాటు పర్యటిస్తుంది.