వైఎస్ సేవలు చిరస్మరణీయం: ఆస్ట్రేలియా ఎన్నారైలు

ABN , First Publish Date - 2021-08-29T23:52:09+05:30 IST

బ్రిస్బేన్: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు ఘనంగా నివాళులు అర్పించారు.

వైఎస్ సేవలు చిరస్మరణీయం: ఆస్ట్రేలియా ఎన్నారైలు

బ్రిస్బేన్: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు ఘనంగా నివాళులు అర్పించారు. బ్రిస్బేన్ నగరంలో సెప్టెంబర్-2కు ముందుగానే జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ చిరస్మరణీయుడని, తెలుగుజాతికి అయన చేసిన సేవలు చరిత్రపుటల్లో నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్‌ఆర్‌టీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వల్లూరి, బిజివేముల రఘు రెడ్డి, కర్రి శ్రీనివాస్, అల్లం యుగంధర్ రెడ్డి, కోట శ్రీనివాస్‌ రెడ్డి, కనుబుద్ది సురేష్, గాదె విజయేందర్, కిషోర్, చాగంటి వంశీ,  బొమ్మిరెడ్డి జస్వంత్, మందా రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ముస్తఫా, బియ్యపు మధుసూదన్ రెడ్డి,  ఏపీ ఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, చల్లా మధు తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నవారిని అభినందించారు. 

Updated Date - 2021-08-29T23:52:09+05:30 IST