ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్.. దాదాపు 2ఏళ్ల తర్వాత ప్రయాణికులకు Australia గుడ్‌న్యూస్..

ABN , First Publish Date - 2021-12-16T23:36:00+05:30 IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రూపాలను మార్చుకుంటూ ప్రజలను కలవర పెడుతోంది. ఒమైక్రాన్ వేరియం

ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్.. దాదాపు 2ఏళ్ల తర్వాత ప్రయాణికులకు Australia గుడ్‌న్యూస్..

ఎన్నారై డెస్క్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రూపాలను మార్చుకుంటూ ప్రజలను కలవర పెడుతోంది. ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై, ప్రయాణికులపై ఆంక్షలకు ఆదేశిస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా దేశ సరిహద్దులను ఓపెన్ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ పౌరులను తమ దేశంలోకి అనుమతిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. నైపుణ్యం కలిగిన విదేశీ పౌరులు, విద్యార్థులు తమ దేశంలోకి అడుగుపెట్టొచ్చని వెల్లడించింది. ఓ మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ.. ‘వైరస్‌తో సహజీవనం చేసేందుకు సిద్ధమైనట్టు’ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా కలకలంతో గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా సరిహద్దులు మూతపడ్డ విషయం తెలిసిందే. 




Updated Date - 2021-12-16T23:36:00+05:30 IST