సంచలన నిర్ణయం.. టీకా తీసుకోని వారు ఇంటి గడప దాటొద్దు..

ABN , First Publish Date - 2021-11-15T04:05:15+05:30 IST

కరోనా కట్టడి కోసం ఆస్ట్రియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకోని వారు ఇంటికే పరిమితమవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

సంచలన నిర్ణయం.. టీకా తీసుకోని వారు ఇంటి గడప దాటొద్దు..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కట్టడి కోసం ఆస్ట్రియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకోని వారు ఇంటికే పరిమితమవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నింబధన సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. సోమవారం నుంచి వివిధ చోట్ల గస్తీ కాస్తూ వీధుల్లోకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. టీకా తీసుకోని వారు వీధుల్లో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే.. కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రం టీకా తీసుకోని వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఆస్ట్రియా జనాభాలో ప్రస్తుతం 65 శాతం మంది కరోనా టీకా తీసుకున్నారు. కానీ..ఐరోపా ఖండంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. అయితే.. ఆస్పత్రుల్లో 30 శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లతో నిండిపోయినప్పుడు ఇటువంటి నిబంధన అమలు చేస్తామని అక్కడి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 

Updated Date - 2021-11-15T04:05:15+05:30 IST