ఎక్బాల్‌పూర్‌ వద్ద టైరు ఊడిపోయి ఆటో బోల్తా

ABN , First Publish Date - 2020-11-26T05:40:17+05:30 IST

తమ కుటుం బ సభ్యులందరితో సహా బందువుల ఇంటికి బయలు దేరిన ఓ కుటుంబంలో విషా దం చోటు చేసుకుంది.

ఎక్బాల్‌పూర్‌ వద్ద టైరు ఊడిపోయి ఆటో బోల్తా
సంఘటన స్థలంలో పడి ఉన్న సాయికృష్ణ మృతదేహం

ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

బోథ్‌ నుంచి గోసంపల్లే వెళ్తుండగా ప్రమాదం

ఖానాపూర్‌, నవంబరు 25: తమ కుటుం బ సభ్యులందరితో సహా బందువుల ఇంటికి బయలు దేరిన ఓ కుటుంబంలో విషా దం చోటు చేసుకుంది. గమ్యస్థానానికి మరో పది కిలోమీటర్ల దూరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కు టుంబంలోంచి ఒక్కరిని కోల్పోయిన ఆ కుటుంబం పుట్టేడు దుఃఖాన్ని మూటగట్టుకొన్న సంఘటన బుధవారం సాయంత్రం ఖానాపూర్‌ మండలం ఎక్భాల్‌పూర్‌ సమీపంలో చోటు చేసుకొంది. ఖానాపూర్‌ ఎస్సై భవానీసేన్‌ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ పట్టణానికి చెందిన ఈర్నాల రమేష్‌ తన ము గ్గురు కుమారులు, భార్యతో కలిసి ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లే గ్రామంలోని తన బంధువుల ఇంటికి బయలు దేరారు. గమ్యస్థానానికి మరో పది కిలోమీటర్ల దూరంలో ఖానాపూర్‌ మండలంలోని ఎక్భాల్‌పూర్‌ వద్ద ఆటో టైరు ఊడిపోయిం ది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఈర్నాల సాయికృష్ణ(15) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న రమేష్‌ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై భవానిసెన్‌ ఈ మేరకు  దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మరొకరి దుర్మరణం

ముథోల్‌: మండలంలోని సరస్వతీ నగర్‌ సమీపంలో భైంసా-బాసర రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం..  భైంసా వైపు నుంచి తానూర్‌ మండలంలోని ఎల్వీ గ్రామానికి వెళ్తున్న ఓ వాహనం, ముథోల్‌ నుంచి భైంసా వైపునకు వెళ్తున్న ద్విచక్రవహనం ఢీకొట్టడంతో  ద్విచక్రవాహనంపై ఉన్న  ఒకరు మృతి చెందగా.. మరోకకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు   108 సమాచారం అందించారు. తీవ్ర గాయాల పాలైన వ్వక్తికి భైంసా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ముథోల్‌ ఎస్సై అశోక్‌  పరిశీలించి పలు వివరా లు తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-11-26T05:40:17+05:30 IST