మోపెడ్ను ఢీకొట్టిన ఆటో..ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-03-05T06:34:27+05:30 IST
మోపెడ్ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
కొండపాక, మార్చి 4: మోపెడ్ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మంగోల్ గ్రామశివారులో గురువారం జరిగింది. కుకునూర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగోల్ గ్రామానికి చెందిన శ్రీరామ్ లచ్చయ్య(48) మోపెడ్పై కుకునూరుపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటాఏస్ ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మోపెడ్పై నుంచి ఎగిరి పడిన లచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.