మోపెడ్‌ను ఢీకొట్టిన ఆటో..ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-05T06:34:27+05:30 IST

మోపెడ్‌ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

మోపెడ్‌ను ఢీకొట్టిన ఆటో..ఒకరి మృతి

కొండపాక, మార్చి 4: మోపెడ్‌ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మంగోల్‌ గ్రామశివారులో గురువారం జరిగింది. కుకునూర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగోల్‌ గ్రామానికి చెందిన శ్రీరామ్‌ లచ్చయ్య(48) మోపెడ్‌పై కుకునూరుపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటాఏస్‌ ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మోపెడ్‌పై నుంచి ఎగిరి పడిన లచ్చయ్యకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో   మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-05T06:34:27+05:30 IST