ప్రమాదంలో బోల్తాపడిన ఆటో
ABN , First Publish Date - 2020-09-19T09:17:21+05:30 IST
ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలమంచిలి-గాజువాక రహదారిలోని జాజులవానిపాలెం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక నుంచి ప్రయాణిలతో ఆటో పరవాడ వ
ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్ర గాయాలు
పరవాడ, సెప్టెంబరు 18: ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలమంచిలి-గాజువాక రహదారిలోని జాజులవానిపాలెం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక నుంచి ప్రయాణిలతో ఆటో పరవాడ వస్తుండగా జాజులవానిపాలెం సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా కొట్టింది.
ఈప్రమాదంలో ఆటో డ్రైవర్ పైలా అప్పలనాయుడు, వడిశల సన్యాసిరావు, వడిశల భవానీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.