ప్రజాస్వామ్యవాదులకు హైకోర్టు తీర్పుతో భరోసా

ABN , First Publish Date - 2021-06-18T05:54:36+05:30 IST

ఢిల్లీ హై కోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు భరోసా వచ్చిందని సీమాంధ్రమేధావుల ఫోరం కన్వీనర్‌ పీఎస్‌ మూర్తి తెలిపారు.

ప్రజాస్వామ్యవాదులకు హైకోర్టు తీర్పుతో భరోసా
సమావేశంలో ప్రసంగిస్తున్న పీఎస్‌ మూర్తి తదితరులు

గుంటూరు, జూన్‌ 17: ఢిల్లీ హై కోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు భరోసా వచ్చిందని సీమాంధ్రమేధావుల ఫోరం కన్వీనర్‌ పీఎస్‌ మూర్తి తెలిపారు. అవగాహన సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్నవారు గతి తప్పినప్పుడు ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికీ ఉండటమే నిజమైన ప్రజాస్వామ్యం అని విద్యార్థి నేతలకు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునివ్వటం హర్షణీయమన్నారు. ఏడాది కిందట ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు దాడులకు సంబంధించిన కేసులో అరెస్టైన ముగ్గురు విద్యార్థులు, హక్కుల కార్యకర్తలకు బెయిల్‌ ఇస్తూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సువాసనను మరింత పరిమళింపచేసిందన్నారు. కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, న్యాయవాది హరి, సుబ్బారెడ్డి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:54:36+05:30 IST