అందరికీ అందుబాటులో ఉంటా
ABN , First Publish Date - 2022-01-19T05:53:17+05:30 IST
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.
జడ్పీ చైర్పర్సన్
ముంచంగిపుట్టు, జనవరి 18: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం ఆమె కిలగాడ పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతీ గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకుంటా నన్నారు. దశల వారీగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జేవీవీఎన్ మూర్తి, పి.మల్లికార్జునరావు బి.దామోదరం తదితరులు పాల్గొన్నారు.