చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్
ABN , First Publish Date - 2021-10-21T22:15:45+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఫ్రెష్టేషన్లో ఉన్నారని చెప్పారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పట్టాభి కోసం చంద్రబాబు దీక్ష చేయడమేంటి?
విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఫ్రెష్టేషన్లో ఉన్నారని చెప్పారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పట్టాభి కోసం చంద్రబాబు దీక్ష చేయడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని చెప్పారు. దీక్షలపై చంద్రబాబు తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. పార్టీ ఆఫీస్లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితం అంతా నేరమయమని విమర్శించారు.