8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతి: అవంతి

ABN , First Publish Date - 2020-06-02T22:05:01+05:30 IST

విశాఖపట్నం: కొత్త టూరిజం పాలసీని తెస్తున్నామని.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.

8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతి: అవంతి

విశాఖపట్నం: కొత్త టూరిజం పాలసీని తెస్తున్నామని.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. కొత్త పాలసీ.. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీ టూరిజం శాఖకు కొత్త యాప్ తెస్తామన్నారు.


కరోనా కారణంగా గత 3 నెలలుగా టూరిజం దెబ్బతిన్నదన్నారు. జూన్ 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతులు ఇస్తున్నామన్నారు. టూరిస్టులను ఆకర్షించే ఎన్నో ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని అవంతి తెలిపారు. పురాతన వస్తు పరిరక్షణ శాఖ తరుపున విజయవాడ బాపు మ్యూజియాన్ని మరిన్ని హంగులతో ఏర్పాటు చేశామన్నారు. 



Updated Date - 2020-06-02T22:05:01+05:30 IST