గంటాపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-08-04T21:03:17+05:30 IST

గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గంటాపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే వైసీపీ వైపు మెగ్గు చూపుతున్నారని అన్నారు. అధికారం ఎక్కడ ఉంటే, గంటా అక్కడ ఉంటారన్నారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని విమర్శించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డుదారిన వైసీపీలో చేరిందేకు ప్రయత్నాలు చేస్తున్నారని, సైకిళ్ళు కుంభకోణం, భూ కుంభకోణాల్లో గంటా, ఆయన అనుచరులు ఉన్నారని మంత్రి ఆరోపించారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశానన్నారు. గంటాపై ఆయన ప్రభుత్వంలో ఉన్నఓ మంత్రే ఫిర్యాదు చేశారని, ఇవన్ని లిక్స్ అని తాను అనుకుంటున్నానని మంత్రి అవంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-04T21:03:17+05:30 IST