మేము ఉన్నంతకాలం భూ ఆక్రమణకు గురికాదు: అవంతి

ABN , First Publish Date - 2020-05-26T00:32:26+05:30 IST

రేషన్‌కార్డు ఉన్నా లేకున్నా అర్హులకు రేషన్‌ ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

మేము ఉన్నంతకాలం భూ ఆక్రమణకు గురికాదు: అవంతి

విశాఖ: రేషన్‌కార్డు ఉన్నా లేకున్నా అర్హులకు రేషన్‌ ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా..దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. తొట్ల కొండపై ఆక్రమణలు జరుగుతున్నాయనేది అవాస్తవమన్నారు. తాను మంత్రిగా, జగన్‌ సీఎంగా ఉన్నంత వరకు..విశాఖ జిల్లాలో ఒక్క అంగుళం కూడా భూ ఆక్రమణకు గురికాదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-26T00:32:26+05:30 IST