మహిళలకు ‘నలంద ఎంపవర్డ్’ అవార్డులు
ABN , First Publish Date - 2021-03-06T07:25:23+05:30 IST
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామని నలంద విద్యా సంస్థల చైర్మన్ ఎం.శ్రీనివాసరాజు అన్నారు.
పంజాగుట్ట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నామని నలంద విద్యా సంస్థల చైర్మన్ ఎం.శ్రీనివాసరాజు అన్నారు. విద్యాసంస్థలు ఏర్పాటు చేసి 40 ఏళ్లు అయిన సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విద్యాసంస్థల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలకు నలంద ఎంపవర్డ్ అవార్డులను అందజేసి సన్మానించారు. అవార్డులు అందుకున్న వారిలో అన్నపూర్ణ, సునీత, సోని కుమందరి, రాధికారెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నలంద విద్యాసంస్థల డైరెక్టర్లు మంతెన నాగమణి, సూర్య పాల్గొన్నారు.