విపత్తులపై విద్యార్థులకు అవగాహన
ABN , First Publish Date - 2022-03-10T04:42:57+05:30 IST
మండలంలోని సం గంబండ ప్రాజెక్టులో బుధవారం ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు.
మక్తల్/రూరల్ మార్చి 9 : మండలంలోని సం గంబండ ప్రాజెక్టులో బుధవారం ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ అధికారి డీఎస్పీ దామోదర్సింగ్ జలాశయంలో ఎలాంటి విపత్తులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లు, అనుకోకుండా జరిగే జలాశయ ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలనే విషయాలపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లో ఎన్డీఆర్ఎఫ్ విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్నాయక్, తహసీల్దార్ రాణాప్రతాప్సింగ్, ఇన్స్పెక్టర్ యోగేష్కుమార్ శర్మ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.