ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్పంచ్‌లకు అవగాహన

ABN , First Publish Date - 2020-09-23T05:56:21+05:30 IST

భూములను క్రమ బద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఎంతో ఉపయోగ పడుతుందని డీఎల్‌పీఓ ఫణీందర్‌రావు అన్నారు

ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్పంచ్‌లకు అవగాహన

కాసిపేట, సెప్టెంబరు 22 : భూములను క్రమ బద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఎంతో ఉపయోగ పడుతుందని  డీఎల్‌పీఓ ఫణీందర్‌రావు అన్నారు. మంగళవారం పెద్దనపల్లి పంచా యతీ కార్యాలయం ఆవరణలో ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్పంచులకు అవ గాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని పెద్దనపల్లి, కొండాపూర్‌, తాటిగూడెం గ్రామపంచా యతీల్లో విక్రయించిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయిం చుకుంటే అధికారికంగా పేర్లు నమోదవుతా యని తెలిపారు. సర్పంచులందరు ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు వివరించాలని సూచించారు. సర్పంచులు కృష్ణ, స్వప్న, శ్రీనివాస్‌, కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T05:56:21+05:30 IST