కరోనా కట్టడికి మాస్క్లే శ్రీరామరక్ష
ABN , First Publish Date - 2022-01-21T03:56:10+05:30 IST
కరోనా కట్టడికి మాస్క్లే శ్రీరామరక్ష అని నాయుడుపేట కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. నాయుడుపేటలో గురువారం రాత్రి పట్టణంలో మాస్క్లు, శానిటైజర్లపై అవగాహన కల్పించారు.
నాయుడుపేట, జనవరి 20 : కరోనా కట్టడికి మాస్క్లే శ్రీరామరక్ష అని నాయుడుపేట కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. నాయుడుపేటలో గురువారం రాత్రి పట్టణంలో మాస్క్లు, శానిటైజర్లపై అవగాహన కల్పించారు. మాస్క్లు లేని కొందరికి మాస్క్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ దుస్తులు ధరించినట్లే మాస్క్లు ధరించడం అలవాటు చేసుకోవాలన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు శానిటైజర్లు, సబ్బుతో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సచివాలయ శానిటరీ ఇన్స్పెక్టర్లు, మహిళా పోలీసులు ఉన్నారు.