‘మెప్మా’ సభ్యులకు కోవిడ్‌పై అవగాహన శిక్షణ

ABN , First Publish Date - 2020-07-08T08:48:30+05:30 IST

పట్టణాల్లో నివసించే పేద మహిళలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ‘మెప్మా’ ఆన్‌లైన్‌

‘మెప్మా’ సభ్యులకు కోవిడ్‌పై అవగాహన శిక్షణ

పట్టణాల్లో నివసించే పేద మహిళలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ‘మెప్మా’ ఆన్‌లైన్‌ ద్వారా స్వయంసహాయక సంఘాల సభ్యురాళ్లకు అవగాహనను పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రం మొత్తం మీద సుమారు 18 లక్షల మంది పట్టణ పొదుపు సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. జిల్లాల్లో రోజుకు 5 చొప్పున,  4 సెషన్లు- ఒక్కొక్క దానిలో 60,000 మందికి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 లక్షల మందికిపైగా మహిళలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  ‘మెప్మా’ మిషన్‌ డైరెక్టర్‌ వి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

Updated Date - 2020-07-08T08:48:30+05:30 IST