Axis Bank: 12 ఈఎంఐల రద్దు.. పండగ ఆఫర్
ABN , First Publish Date - 2021-10-20T08:05:51+05:30 IST
పండగ సీజన్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ‘దిల్ సే ఓపెన్ సెలెబ్రేషన్స్: క్యోంకి దీవాలి రోజ్ రోజ్ నహీ ఆతీ’ పేరిట కస్టమర్లకు ఆకర్షణీ యమైన ఆఫర్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: పండగ సీజన్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ‘దిల్ సే ఓపెన్ సెలెబ్రేషన్స్: క్యోంకి దీవాలి రోజ్ రోజ్ నహీ ఆతీ’ పేరిట కస్టమర్లకు ఆకర్షణీ యమైన ఆఫర్లు ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని గృహ రుణాలపై 12 ఈఎంఐల రద్దు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు చెల్లింపులపై డీల్స్, డిస్కౌంట్లు, వివిధ ఆన్లైన్ కొనుగోళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే టూ వీలర్ కస్టమర్లకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఆన్రోడ్ ఫైనాన్స్ అందించనుంది. వ్యాపార సంస్థల యజమానులకు టర్మ్ రుణాలు, పరికరాల కొనుగోలు రుణాలు, వాణిజ్య వాహనాల ఫైనాన్సింగ్పై పలు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. 50 నగరాల్లో 2,500 మంది ఎంపిక చేసిన స్థానిక వ్యాపారుల వద్ద చేసే చెల్లింపులపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్టు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సుమీత్ బాలి చెప్పారు.