జే గ్యాంగ్‌ భూములన్నీ కొట్టేస్తోంది: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2020-05-28T22:08:04+05:30 IST

జే గ్యాంగ్‌ భూములన్నీ కొట్టేస్తోందని టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. విశాఖలో భూములన్నీఎంపీ విజయసాయిరెడ్డి కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

జే గ్యాంగ్‌ భూములన్నీ కొట్టేస్తోంది: నారా లోకేష్‌

అమరావతి: జే గ్యాంగ్‌ భూములన్నీ కొట్టేస్తోందని టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. విశాఖలో భూములన్నీఎంపీ విజయసాయిరెడ్డి కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రూ.1000కోట్లు విలువైన వాల్తేరు భూమిని కొట్టేయాలని చూశారని, దసపల్లా భూములను కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్‌లో నాలుగు నెలల్లో 500 భూకబ్జా కేసులు నమోదయ్యాయని తెలిపారు. పేదల ప్రజల నెత్తురును మద్యం రూపంలో తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘కేవలంలో మద్యంలో జగన్‌రెడ్డి ట్యాక్స్‌ 5వేల కోట్లు రాబట్టారు. జగన్‌రెడ్డి నిర్వాకం వల్ల భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా విషయంలో జగన్‌ అలసత్వం వహించారు. శానిటైజర్లు, మాస్కుల, టెస్టింగ్‌ కిట్లలో అవినీతి జరిగింది. పేదలకు సెంట్‌ భూమి కాదు... వైసీపీకి అద్భుతమైన స్కామ్‌గా మారింది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భూములు లాక్కుంటున్నారు. ప్రభుత్వ భూములన్నీ జగన్ తన అనుచరులకు ఇప్పించే కుట్ర చేస్తున్నారు. శ్రీవారి ఆస్తులు అమ్మకానికి పెట్టారంటే జగన్‌ ధనదాహానికి పరాకాష్ట’’ అంటూ లోకేష్‌ దుయ్యబట్టారు.

Updated Date - 2020-05-28T22:08:04+05:30 IST