అయోధ్యలో బస్ స్టేషన్ నిర్మాణం.. రూ. 400 కోట్ల ప్రాజెక్టుకు యూపీ అనుమతి
ABN , First Publish Date - 2021-06-15T05:10:31+05:30 IST
అయోధ్యలోని రామాలయ సందర్శనకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్ట్ స్టేషన్ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
లక్నో: అయోధ్యలోని రామాలయ సందర్శనకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్ట్ స్టేషన్ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. దీనికి తోడు.. ఆయోధ్య-సుల్తాన్పూర్ రహదారిపై నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనకు కూడా కాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షత వహించారు. కాగా.. బస్ స్టేషన్ నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న తొమ్మిది ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ స్టేషన్కు బస్సు సర్వీసులు ఉంటాయని కేబినెట్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.