మేళతాళాలు లేని పెళ్లి... కన్యాదానం చేసిన ఆలయ పూజారి!
ABN , First Publish Date - 2020-05-19T12:43:57+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నియమాల కారణంగా వారి వివాహం మేళతాళాలు లేకుండానే జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ యూపీలోని అయెధ్యలోగల హనుమాన్గడిలో ఈ వివాహం జరిగింది. ఆలయ పూజారి...
అయోధ్య: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నియమాల కారణంగా వారి వివాహం మేళతాళాలు లేకుండానే జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ యూపీలోని అయెధ్యలోగల హనుమాన్గడిలో ఈ వివాహం జరిగింది. ఆలయ పూజారి స్వయంగా కన్యాదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజు దాస్ మాట్లాడుతూ ఆలయంలో ఉన్న యజ్ఞశాలలో వివాహ వేడుక జరిగింది. పూరాబజార్ పరిధిలోని డియోగఢ్గ్రామంలో నివసిస్తున్న ఉపేంద్ర సింగ్, బస్తీ జిల్లాకు చెందిన పూజా సింగ్ను వివాహం చేసుకున్నాడు. వివాహానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. వివాహ సమయంలో సామాజిక దూరాన్ని పాటించారని తెలిపారు. వివాహం అనంతరం వరుడి ఇంటిలో పరిమిత సంఖ్యలో అతిథులకు విందు ఏర్పాటు చేశారు.