అయోధ్య ముస్తాబు..

ABN , First Publish Date - 2020-08-05T07:32:59+05:30 IST

భూమిపూజను పురస్కరించుకుని అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి వీధిలో నవ్య రామాలయం నమూనా, రామ్‌లల్లా (బాలరాముడు) ఫ్లెక్సీలు, ఫొటోలు

అయోధ్య ముస్తాబు..

భూమిపూజను పురస్కరించుకుని అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి వీధిలో నవ్య రామాలయం నమూనా, రామ్‌లల్లా (బాలరాముడు) ఫ్లెక్సీలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీపావళి వేడుకలను తలపిస్తూ మంగళ, బుధవారాల్లో దీపాలు వెలిగించాలని నిర్ణయించారు. దీపపు కాంతుల్లో.. సరయూనది ఒడ్డున ఉన్న.. అయోధ్య ముగ్ధమనోహరంగా దర్శనమిస్తోంది. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిషేధాజ్ఞలు విధించారు. నగరంలోకి బయటివారిని అనుమతించరు. స్థానికులు కూడా సరైన గుర్తింపు కార్డులు చూపితేనే శంకుస్థాపనకు అనుమతిస్తారు. భూమిపూజను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Updated Date - 2020-08-05T07:32:59+05:30 IST