సైబర్ వలలో ఆయుర్వేద డాక్టర్
ABN , First Publish Date - 2021-06-30T02:40:07+05:30 IST
సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా అత్యాశకు వెళ్లి విద్యావంతులు కూడా
హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా అత్యాశకు వెళ్లి విద్యావంతులు కూడా మోసపోతున్నారు. తాజాగా నగరంలోని సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఆయుర్వేద డాక్టర్ మోసపోయింది. మెహిదీపట్నంకు చెందిన ఆయుర్వేద డాక్టర్ శైలాను సైబర్ చీటర్ ట్రాప్ చేసాడు. నైజీరియాకు చెందిన జేమ్స్ మారియో ఆమె నుండి నలభై లక్షల రూపాయలను సైబర్ చీటర్ కాజేసాడు. అమెరికా కంపెనీకి మెడిసిన్ ఫార్ములా విక్రయిస్తే 5 కోట్లు ఇప్పిస్తానని డాక్టర్కు ఆఫర్ చేశాడు. డాలర్స్ ఎక్స్చేంజ్, ట్రాన్స్ఫర్ చార్జెస్ అంటూ శైలా నుంచి 40 లక్షల రూపాయలను సైబర్ చీటర్ కాజేసాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్స్లో బాధితురాలు డాక్టర్ శైలా ఫిర్యాదు చేసింది.