పాస్టర్ ప్రవీణ్ అరాచకాలపై నోరు మెదపరేం: అయ్యన్న
ABN , First Publish Date - 2021-01-17T17:50:34+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హిందూ దేవుళ్ల విగ్రహాలను నేను పగలుగొట్టాను, కాలితో తన్నాను, మత మార్పిడులు చేశానని చెప్పిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసి నాలుగు రోజులయ్యింది. ప్రవీణ్ను ఇప్పటి వరకు మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రవీణ్ వెనుక ఎవరు ఉన్నారని నిలదీశారు. ప్రవీణ్ వెనుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గర బంధువుల వివరాలు ఎప్పుడు మీడియాకు చెపుతున్నారని ప్రశ్నించారు. అసలు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరాచకాల గురించి వైసీపీ పార్టీలో ఒక్కరు కూడా ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. నామాలు పెట్టుకుని, గోపూజలు చేస్తే కాదు. ఇలాంటి వాడిని శిక్షించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ప్రజలు, మీరు క్రిస్టియన్ అయినా, హిందువులు పట్ల మీకు గౌరవం ఉందని ప్రజలు నమ్ముతారని.. ఈ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాఫియాని బయట పెట్టాలి’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.