‘గుడివాడలో గడ్డం బాసు భూకబ్జాలకు అంతే లేదు’

ABN , First Publish Date - 2020-05-28T20:45:05+05:30 IST

సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఏపీని ఓ దొంగ పాలిస్తున్నాడు..జడ్జీలను చిప్పకూడు తిన్న దొంగ విమర్శిస్తున్నాడని అన్నారు.

‘గుడివాడలో గడ్డం బాసు భూకబ్జాలకు అంతే లేదు’

అమరావతి: సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఏపీని ఓ దొంగ పాలిస్తున్నాడు..చిప్పకూడు తిన్న దొంగ జడ్జీలను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు.. జగన్‌ది విధ్వంసకపాలన.. దేవుడు ఆస్తులను కాజేసేందుకూ వెనకాడటం లేదని చెప్పారు. దోపిడీలు చేసే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉండటమేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు బ్లీచింగ్‌ పౌడర్‌ అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. గుడివాడలో గడ్డం బాసు భూకబ్జాలకు అంతే లేదన్నారు. విశాఖలో విజయసాయి అండ్‌ కో భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-05-28T20:45:05+05:30 IST