అబ్బాయ్ గారు.. ఈ సారి ఏ బాబాయ్కి గురిపెట్టారో! : అయ్యన్న
ABN , First Publish Date - 2021-12-13T17:41:08+05:30 IST
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. సీఎం జగన్ రెడ్డి ప్రాణాలకు
హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. సీఎం జగన్ రెడ్డి ప్రాణాలకు హానితలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం.. మరో కోడికత్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్లాగా అనిపిస్తోందన్నారు. ‘‘నిన్న తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారూ జగన్ రెడ్డి ప్రాణాలకు హానితలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం.. మరో కోడికత్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్లాగా అనిపిస్తోంది. ఓవైపు అప్పులకుప్ప, మరోవైపు తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో.. మళ్లీ కోడికత్తికి సానబెడుతూ, గొడ్డలికి దారుబెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అబ్బాయ్ గారు.. ఈ సారి ఏ బాబాయ్కి గురిపెట్టారో! తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దుర్మార్గుడికి దూరంగా ఉంటున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోంది. బురద రాజకీయం మాని హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్లో పేర్కొన్నారు.