యానాంలో మల్లాడికి ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-10-24T06:33:37+05:30 IST

ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, టీటీడీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టి శనివారం తొలిసారిగా యానాం వచ్చిన మల్లాడి కృష్ణారావుకు, మంత్రుల బృందానికి మల్లాడి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు.

యానాంలో మల్లాడికి ఘన స్వాగతం

యానాం, అక్టోబరు 23:  ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి,  టీటీడీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టి శనివారం తొలిసారిగా యానాం వచ్చిన మల్లాడి కృష్ణారావుకు, మంత్రుల బృందానికి మల్లాడి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. సావిత్రినగర్‌ నుంచి ర్యాలీగా ఇంటికి వచ్చారు. గిరియాంపేట, దరియాలతిప్ప, దొమ్మేటిపేట, అయ్యన్నగర్‌, ఫరంపేట, కురసాంపేట, ఓల్డ్‌ రాజీవ్‌నగర్‌, భీమ్‌నగర్‌, కనకాలపేట, గోపాల్‌నగర్‌, గణపతినగర్‌, మెట్టకుర్రు, రమబాయినగర్‌, సీతంపేట, అంబేద్కర్‌నగర్‌, పాతబస్టండ్‌, చిన్నసెంటర్‌, విష్టాలయం, చింతవారివీధి, కొత్తపేటమీదుగా ర్యాలీ సాగింది. నియోజకర్గపరిధిలో మల్లాడికి అడుగడుగునా ప్రజలు నీరాజనలు పలికారు. ఈసందర్భంగా మల్లాడిని పలువురు గజమాలలతో సత్కరించారు. 



Updated Date - 2021-10-24T06:33:37+05:30 IST