బాసుంది

ABN , First Publish Date - 2021-10-02T18:14:57+05:30 IST

స్టవ్‌పై ఒక మందపాటి పాన్‌పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో కుంకుమపువ్వు వేయాలి. పాలు బాగా మరిగి సగానికి తగ్గిన తరువాత పంచదార వేయాలి. మరో మూడు, నాలుగు నిమిషాలు మరిగించాలి.

బాసుంది

కావలసినవి: పాలు - క్రీము తీయని పాలు, కుంకుమపువ్వు - కొద్దిగా, పంచదార - ఒక కప్పు, సీతాఫలాలు - రెండు.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక మందపాటి పాన్‌పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో కుంకుమపువ్వు వేయాలి. పాలు బాగా మరిగి సగానికి తగ్గిన తరువాత పంచదార వేయాలి. మరో మూడు, నాలుగు నిమిషాలు మరిగించాలి. తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని పాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు సీతాఫలం గుజ్జు వేసి కలుపుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి సీతాఫలం బాసుంది సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-10-02T18:14:57+05:30 IST