చంద్రబాబు డ్రామాలకు విలువ లేదు
ABN , First Publish Date - 2021-03-02T08:30:36+05:30 IST
‘‘రేణిగుంట విమానాశ్రయంలో కూర్చొని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ఆయన డ్రామాలకు విలువ లేదు. టీడీపీ తరఫున నామినేషన్లు వేయడానికి అభ్యర్థులే
టీడీపీని ప్రజలు డస్ట్బిన్లో పడేశారు: సజ్జల, మంత్రులు
అనంతపురం/తిరుపతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘‘రేణిగుంట విమానాశ్రయంలో కూర్చొని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ఆయన డ్రామాలకు విలువ లేదు. టీడీపీ తరఫున నామినేషన్లు వేయడానికి అభ్యర్థులే లేరు. నామినేషన్లు వేయకుండా బెదిరించాల్సిన అవసరం మాకు లేదు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం అనంతపురం వచ్చిన ఆయన, మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీని ప్రజలు డస్ట్బిన్లో పడేశారని అన్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తామని బొత్స అన్నారు. తిరుపతి ఎయిర్పోర్టులో చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో విమర్శించారు. బాబు హైడ్రామాకు తెర తీశారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కార్వేటినగరంలో అన్నారు.