చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-21T03:35:23+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత కన్వీనర్ గెరిటి చెంచయ్య ఆధ్వర్యంలో గురువారం పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పొలటెంకాయలు కొట్టారు.
వెంకటగిరి(టౌన్), జనవరి 20: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత కన్వీనర్ గెరిటి చెంచయ్య ఆధ్వర్యంలో గురువారం పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పొలటెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అలుపెరగని పోరాటం చేస్తున్నాడన్నారు. అనంతరం బైక్ ర్యాలీగా పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రామదాసు గంగాధర్, కేవీకే ప్రసాద్, విశ్వనాఽథ్, హరిప్రసాద్, సుబ్బు యాదవ్, టీ. వెంకటేష్, శశిధర్ రెడ్డి, ప్రసన్న కుమార్, వెంకటేష్, సురేష్ రెడ్డి, గిరి, అరుణ్, అజాజ్ తదితరులు పాల్గొన్నారు.