బాబు త్వరగా కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-22T05:22:58+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆపార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

బాబు త్వరగా కోలుకోవాలని పూజలు

తలుపుల, జనవరి 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆపార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి, ప్రజా సమస్యలపైన ఉద్యమించడానికి తమ నాయ కులు ముందుండాలని, వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దుల రాముడు, పార్థసారథి, అజంతుల్లా, సిద్ధిక్‌వలీ, మహేష్‌బాబు, లోకేశ్వర, శివశంకర్‌రెడ్డి, రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:22:58+05:30 IST