మూడు రోజులైనా తెలియని పసికందు ఆచూకీ

ABN , First Publish Date - 2020-03-12T15:22:33+05:30 IST

మూడు రోజులైనా తెలియని పసికందు ఆచూకీ

మూడు రోజులైనా తెలియని పసికందు ఆచూకీ

భద్రాద్రి: భ్రదాచలం ఆస్పత్రిలో అదృశ్యమైన పసికందు ఆచూకీ ఇంకా లభించలేదు. పసికందు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం భద్రాచలం ఆస్పత్రిలో పసికందు అదృశ్యమైంది. గుర్తుతెలియనివాళ్లు సీసీ కెమెచరాల స్విచ్ ఆఫ్ చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ యుగంధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా పసికందును తీసుకెళ్లిన మహిళను పోలీసులు గుర్తించారు. బూర్గంపాడు మండలం సారపాక వరకు ఆటోలో మహిళ వెళ్లినట్లు నిర్ధారించారు. పసికందు కోసం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో మూడు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. 

Updated Date - 2020-03-12T15:22:33+05:30 IST