బడుగుల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న

ABN , First Publish Date - 2021-04-20T05:27:04+05:30 IST

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని ప్రభుత్వ మాజీ విప్‌, శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ కొనియాడారు.

బడుగుల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న
లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కూన రవికుమార్‌

గుజరాతీపేట : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని ప్రభుత్వ మాజీ విప్‌, శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ కొనియాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు గౌతు లచ్చన్న వర్దంతి కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల నడుమ నిర్వహించారు. తొలుత రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పార్టీ నాయకులు పీఎంజే బాబు, రమణమాదిగ తదితరులు గౌతు లచ్చన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో నాయ కులు తులసి, కరగాన భాస్కర్‌, సురకాసి వెంకట రావు కార్యకర్తలు, అభిమా నులు పాల్గొన్నారు. శ్రీశయన సంఘ జిల్లా అధ్యక్షుడు గుజ్జల శాంతేశ్వరరావు ఆధ్వర్యంలో డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లో గల సర్దార్‌ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీపీ దేవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-20T05:27:04+05:30 IST